భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల వయసులో ఏటీపీ టెన్నిస్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. తద్వారా అత్యంత వృద్ధ వయసులో నెంబర్.1 ర్యాంక్ను చేరిన టెన్నిస్ ప్లేయర్గా తన పేరు లిఖించుకున్నారు. అయితే, ఈ ర్యాంకులు ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన తర్వాత ప్రకటించబడతాయి.
బుధవారం (జనవరి 24) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో క్వార్ట్స్ డబుల్స్లో బోపన్న- మాథ్యూ ఎబ్దిన్ జోడి విజయం సాధించింది. అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెనిపై 6-4, 7-6 స్కోరుతో వరుస సెట్లలో గెలుపొందారు. ఈ విజయంతో బోపన్న-ఎబ్దిన్ జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో బోపన్న ఏటీపీ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. వచ్చే వారం ఈ ర్యాంకులు వెల్లడికానున్నాయి.
BOPANNA TO BECOME WORLD NO 1 FOR THE FIRST TIME AT AGE 43@rohanbopanna will reach the rankings summit as he moves into the SF of the Australian Open pic.twitter.com/4ne80n0qZ7
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) January 24, 2024
భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా తర్వాత డబుల్స్లో ప్రపంచ నెం.1గా నిలిచిన నాల్గవ భారత టెన్నిస్ ప్లేయర్ బోపన్న. 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్లోకి ఎంట్రీ ఇచ్చిన బొప్పన్న.. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ను చేరుకోవడం ఇదే తొలిసారి.