హైదరాబాద్: రాబోయే రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండడంతో…..అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉండాలని CS సోమేష్ కుమార్ ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.