హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోవడం బాధకరమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వీధి కుక్కలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ కు రాజాసింగ్ సూచించారు . తన ఇంట్లో కూడా చిన్న పిల్లలున్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం అర్థిక సాయం అందించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
బాగ్ అంబర్పేటలో నివాసం ఉంటున్న గంగాధర్.. అదివారం సెలవు కావడంతో తన కొడుకు ప్రదీప్, కూతురును సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. పనిమీద గంగాధర్ అక్కడినుంచి వెళ్లగా, ప్రదీప్ నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. నోట కరచుకుని రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో ప్రదీప్ చనిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.