
తీర్థక్షేత్రమైన కేదార్ నాథ్ లో భక్తులకు హిమపాతాల అందాలు కనువింపు చేస్తన్నాయి. కేదార్నాథ్ ధామ్ వెనుక ఉన్న గాంధీ సరోవర్పై ఆదివారం హిమపాతం సంభవించింది. హిమపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాంధీ సరోవర్ పర్వతంపై నుంచి ఈరోజు ఉదయం 5గంటలక నుంచే మంచు కరిగి వాలును అనుసరించి జారుతూ వస్తుంది.
VIDEO | Uttarakhand: An avalanche occurred over Gandhi Sarovar in Kedarnath. No loss of life and property was reported. More details are awaited. pic.twitter.com/yfgTrYh0oc
— Press Trust of India (@PTI_News) June 30, 2024
ఈ హిమనీదాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని కేదార్నాథ్ సెక్టార్ అధికారి నివేదించినట్లు విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. జూన్ ప్రారంభంలో కేదార్నాథ్ ధామ్కు భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చారు. జూన్ 6 వరకు వారి సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రితో కూడిన చార్ ధామ్ యాత్ర సర్క్యూట్లో భక్తుల సంఖ్య పెరిగింది.