- ఉమెన్స్ డే సందర్భంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని 19 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. తానిపర్తి చికిత(ఆటలు), కుడుముల లోకేశ్వరి(ఆటలు), ముక్తేవి భారతి(సాహిత్యం), దివనపల్లి వీణావాణి, ఎస్ జబీన్ (లిటరేచర్-ఉర్దూ), బండ సరోజన (ఎడ్యుకేషన్ -కరికులం), బిన కేశవరావు (హ్యాండిక్రాఫ్ట్), గుర్రాల సరోజ(సోషల్ సర్వీస్), జమీల నిషత్(సోషల్ సర్వీస్), అరిపిన జయలక్ష్మి(స్పెషల్ కేటగిరీ), దయ్యాల భాగ్య(డాన్స్, -ఫిజికల్ చాలెంజ్), ప్రొఫెసర్ అరుణ భిక్షు (కూచిపుడి నృత్యం) ను అవార్డులకు ఎంపిక చేసింది. సునీల ప్రకాశ్(పేరిణి నృత్యం), బండి రాములమ్మ(బోనాల కోలాటం), గొరిగె నీల (బోనాల కోలాటం), మట్టది సరవ్వ (డప్పు కళాకారిణి), సీహెచ్ పుష్ప (ఏకచక్రపురం రైతు), లుఖ్మా కమ్యూనిటీ (సఫా ఎన్జీవో), శక్తి టీమ్ (దక్షిణ మధ్య రైల్వే విమెన్ ఆర్పీఎఫ్)ను అవార్డులకు ఎంపిక చేసింది.