జనగామలో ఆయుష్మాన్​ భారత్ ​ఫస్ట్ సర్జరీ

జనగామలో ఆయుష్మాన్​ భారత్ ​ఫస్ట్  సర్జరీ

జనగామ, వెలుగు: జనగామ జిల్లా గవర్నమెంట్ ​హాస్పిటల్​లో ఆయుష్మాన్ భారత్ కింద తొలి సర్జరీ చేసినట్లు హాస్పిటల్ ​సూపరింటెండెంట్ సుగుణాకర్ ​రాజు తెలిపారు. గుండాల మండలం వెల్మజాలకు చెందిన కాచిగల్ల ఎల్లయ్యకు సోమవారం బైలాట్రల్​హైడ్రోసీల్​సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి ఆయుష్మాన్​భారత్ వర్తిస్తుందని చెప్పారు. ఈ స్కీమ్ కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చును సర్కారే భరిస్తుందన్నారు. 642 రకాల జబ్బులకు ఈ స్కీమ్​కింద ట్రీట్​మెంట్ అందుతుందని చెప్పారు. హెవీ ఫీవర్, కొవిడ్​ ట్రీట్​మెంట్​దీని పరిధిలోకి వస్తాయన్నారు.