- సచివాలయంలోని చాంబర్లో ప్రత్యేక ప్రార్థనలు
- ఫకీర్ రిహాబిలిటేషన్ ఫైల్ పై తొలి సంతకం
హైదరాబాద్: మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా మహ్మద్ ఆజా రుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం 12.15గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన చాంబర్ లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఫకీర్ రిహాబిలిటేషన్ ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. తనపైముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబె ట్టుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డికి కృత జ్ఞతలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీ కరించిన అజారుద్దీన్ కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
