![సింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్](https://static.v6velugu.com/uploads/2024/05/b-janak-prasad-requested-to-implement-second-pension-scheme-for-singareni-employees_Y1trD9Qsnu.jpg)
గోదావరిఖని, వెలుగు : కోల్ ఇండియాలో అమలు చేస్తున్నట్టుగా సింగరేణిలో ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ కోరారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్ ఎన్వికె శ్రీనివాస్ను కలిసి మెమోరాండం అందజేశారు.
సింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం వల్ల వారు రిటైర్డ్ అయితే సుమారుగా రూ.20 లక్షల వరకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై యూనియన్ పక్షాన కోల్ ఇండియా ఆఫీసర్లతో కూడా చర్చిస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ వల్ల పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా కొత్త గనులు ప్రారంభించాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు.