మోడీ కేదారినాథ్ టూర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనే : చంద్రబాబు

మోడీ కేదారినాథ్ టూర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనే : చంద్రబాబు

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.  ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని బాబు తన లేఖలో ఆరోపించారు.

ప్రచారం ముగిసిన తర్వాత మోడీ… కేదార్‌నాథ్, బద్రీనాథ్ పర్యటనలకు వెళ్లారని, అది కచ్చితంగా ఉల్లంఘన కిందికే వస్తుందని చంద్రబాబు అన్నారు. మోడీ ఆధ్యాత్మకి పర్యటనను కొన్ని మీడియా ఛానెల్స్ నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను అది ప్రభావితం చేస్తుందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.