టెర్రస్​పైన వాకింగ్​ చేస్తున్న జంటపై కోతుల దండు దాడి

టెర్రస్​పైన వాకింగ్​ చేస్తున్న జంటపై కోతుల దండు దాడి

బరేలీ: సాయంత్రంపూట టెర్రస్​పైన వాకింగ్​ చేస్తున్న ఓ జంటపై కోతుల దండు దాడిచేసింది.. తండ్రి చేతుల్లోని పసికందును లాగి కిందపడేసింది. దీంతో ఆ పసికందు చనిపోయిండు. ఉత్తరప్రదేశ్​లోని బరేలీ జిల్లాలో ఆదివారం జరిగిందీ విషాదం. స్థానిక అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని డుంకాలో నిర్దోష్​ ఉపాధ్యాయ్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు నాలుగు నెలల క్రితమే కొడుకు పుట్టిండు. ఆదివారం సాయంత్రం దంపతులిద్దరూ తాము ఉంటున్న బిల్డింగ్​ పైకి వెళ్లారు. ఇద్దరూ వాకింగ్​ చేస్తుండగా కోతుల గుంపు ఒకటి వాళ్లను చుట్టుముట్టింది. భయంతో మెట్లవైపు పరిగెత్తే క్రమంలో నిర్దోష్ చేతుల్లో ఉన్న పసికందు కిందపడ్డడు. వెంటనే బాబును ఎత్తుకునేందుకు ప్రయత్నించగా.. ఓ కోతి బాబును లాగేసింది. ఆపై బిల్డింగ్​ పై నుంచి విసిరేసింది. మూడు అంతస్థుల నుంచి కిందపడ్డ ఆ పసికందు అక్కడికక్కడే చనిపోయాడు.