మాతాశిశు కేంద్రంలో పసికందు మృతి

మాతాశిశు కేంద్రంలో పసికందు మృతి

కొల్లాపూర్(నాగర్​ కర్నూల్), వెలుగు:    డాక్టర్లు లేకపోవడంతో  నర్సులు కాన్పు చేయడానికి ప్రయత్నించడంతో  శిశువు చనిపోయిందని  నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్  మండలం రామాపురం మాత శిశు ఆరోగ్య కేంద్రం ముందు శనివారం బంధువులు ఆందోళన చేశారు.

వివరాలిలా ఉన్నాయి.  ఎన్మన్​బెట్ల  గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణిని డెలివరీ కోసం తీసుకొచ్చారు.  ఇద్దరు డాక్టర్లు డ్యూటీలో లేకపోవడంతో నర్సులు కాన్పు చేశారని,   వారికి అవగాహన లేకపోవడంతో శిశువు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రికి వస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. రెఫర్​ చేసినా వేరే ఆస్పత్రికి వెళ్లే వాళ్లమన్నారు. శిశువు మృతికి కారణమైన నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.