ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ మంగళవారం మొదలైంది. ఆరుగురు మెంబర్లుండే ఈ ఎంపీసీ నిర్ణయాన్ని గురువారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించనున్నారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను ఎంపీసీ మార్చకపోవచ్చని, యధాతథంగానే కొనసాగించే అవకాశాలు ఎక్కువని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
రేట్ల పెరుగుదల (ఇన్ఫ్లేషన్) భయాలతోపాటు, అప్పులపై వడ్డీ రేట్లు నిలకడగా ఉంటేనే ఎకానమీలో గ్రోత్ మొమెంటమ్ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఏప్రిల్, జూన్ మీటింగ్లలో రెపో రేటులో ఎలాంటి మార్పులను ఆర్బీఐ చేయలేదు. ఇటీవల భారీగా పెరిగిన టమోట రేట్ల కారణంగా వెంటనే వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుందని తాము అనుకోవడం లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక రిపోర్టులో పేర్కొంది.
వడ్డీ రేట్లతోపాటు, పాలసీ విషయంలోనూ ఆర్బీఐ స్టేటస్కో మెయింటెయిన్ చేస్తుందనే ఎనలిస్టులు అంచనా వేస్తున్నట్లు హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధృవ్ అగర్వాలా చెప్పారు. కూరగాయలు సహా కొన్ని ఫుడ్ ఐటమ్స్రేట్లు ఇటీవలి కాలంలో బాగా పెరగడాన్ని ఆర్బీఐ లోతుగా విశ్లేషిస్తోందని పేర్కొన్నారు.