ఖైరతాబాద్,వెలుగు: ఎస్సీ ఉప కులాలకు తహశీల్దార్ ద్వారా కులధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఆర్డీవో ద్వారా ఇస్తుండగా క్యాస్ట్ సర్టిఫికెట్ రావడానికి చాలా రోజులు పడుతుందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ 57 ఉపకులాల నేతలతో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో రౌండ్టేబుల్సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలు ఎస్సీ ఉపకులాల సంఘాల నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ఎస్సీ డిక్లరేషన్లో భాగంగా మాల, మాదిగ, ఉప కులాలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు హామీ మేరకు పెట్టి.. రూ.750 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.
వర్గీకరణ జరిగితే ఎస్సీ 57 ఉపకులాలను –ఏ కేటగిరిలో చేర్చి, జనాభా దామాషా మేరకు 7 శాతం రిజర్వేషన్కల్పించాలని పేర్కొన్నారు. ఎస్సీ ఉప కులాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థుల విజయానికి కృషిచేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు టీఎన్స్వామి, కర్నె రామారావు, చంద్రగిరి సత్యనారాయణ, నాగయ్య స్వామి,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
