IPL 2025: ముంబైలో చేరి జాక్ పాట్ కొట్టేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. అదే జరిగితే పంత్ కంటే ఖరీదైన ఆటగాడు

IPL 2025: ముంబైలో చేరి జాక్ పాట్ కొట్టేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. అదే జరిగితే పంత్ కంటే ఖరీదైన ఆటగాడు

ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ముంబై స్టార్ ఫారెన్ ప్లేయర్లు రికెల్ టన్, విల్ జాక్స్ దూరం కావడం ముంబైకి గట్టి ఎదురు దెబ్బ. వీరి స్థానాల్లో చరిత అసలంక, బెయిర్ స్టో ప్లేయింగ్ 11లోకి రానున్నారు. వీరిద్దరూ తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకుంట ముంబైకి మరో ఆప్షన్ లేదు.  ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

ప్రస్తుతం ముంబైగా జట్టులో వికెట్ కీపర్స్ లేరు. భారత డొమెస్టిక్ ప్లేయర్లు రాబిన్ మింజ్, శ్రీజిత్ ఉన్నప్పటికీ అనుభవం లేకపోవడంతో వారికి ప్లే ఆఫ్స్ కు ఛాన్స్ ఇవ్వరు. దీంతో వికెట్ కీపర్ కోసమైనా ముంబై ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ ను ప్లేయింగ్ 11 లో చేర్చనుంది. విల్ జాక్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ జానీ బెయిర్ స్టోను నియమించుకుంది. ఈ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ రూ.5.25 కోట్ల రూపాయలకు ముంబై జట్టులో చేరాడు. కేవలం ప్లేయర్ ఆఫ్స్ కోసమే బెయిర్ స్టో కు రూ.5.25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. దీంతో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ కు జాక్ పాట్ తగలనుంది 

►ALSO READ | టెస్టు ప్లేయర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌.. నేటి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌

ఈ సీజన్ లో ముంబై అత్యధికంగా మూడు మ్యాచ్ లు ఆడే ఆడనుంది. ఎలిమినేటర్ గెలిస్తే క్వాలిఫయర్ 2.. అది కూడా గెలిస్తే ఫైనల్. ఒకవేళ ముంబై మూడు మ్యాచ్ లు ఆడితే బెయిర్ స్టో ఒక మ్యాచ్ కు రూ.1.75 కోట్ల రూపాయలు అందుతాయి. అలా కాకుండా రెండు మ్యాచ్ లు ముంబై ఫైనల్ కు చేరకుండా క్వాలిఫయర్ 2 లో ఓడిపోతే బెయిర్ స్టో ఒక మ్యాచ్ కు రూ.2.60 కోట్ల రూపాయలు అందుతాయి. ఈ రెండు కాకుండా ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో నే ఓడిపోతే కేవలం ఒక్క మ్యాచ్ కే ఈ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ రూ.5.25 కోట్ల రూపాయలు తీసుకోనున్నాడు. 

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తాత్కాలిక రీప్లేస్ మెంట్ లు ప్రకటించుకోవచ్చు అని చెప్పింది.  తమ జట్లలోని విదేశీ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి అనుమతించారు. ఈ రూల్ ప్రకారం తాత్కాలిక ప్రత్యామ్నాయ ఆటగాళ్లు వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకునే అవకాశం లేదు. వారు 2026 ఐపీఎల్ మినీ వేలంలో తమ పేరును నమోదు చేసుకోవాలి. అని బీసీసీఐ తెలిపింది.