హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోని 100 ఎకరాల భూమిని కొట్టేయడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం తార్నాక వరకు 1.2 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును వేస్తున్నదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ శుక్రవారం ఆరోపించారు. గురువారం బైపాస్ రోడ్డుకు భూమి పూజ చేసినట్టు వర్సిటీ వీసీ ఆఫీసు ప్రకటన చేసిందని, ఫొటోలనూ ఆన్లైన్లో పెట్టి.. వెంటనే డిలీట్ చేశారని పేర్కొన్నారు.
తాము బయటపెట్టిన తర్వాత ఇన్విటేషన్లను ప్రింట్ చేశారని, అందులో దోపిడీ పార్ట్నర్స్ అయిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతల పేర్లు పెట్టి.. ఎంపీ రేవంత్ రెడ్డి పేరు పెట్టలేదని విమర్శించారు. బైపాస్ రోడ్డు పేరిట 50 ఇండ్లను కూల్చేందుకు మార్కింగ్స్ వేశారన్నారు. వర్సిటీలను నాశనం చేసేందుకు అనర్హులను కేసీఆర్ వీసీలుగా నియమిస్తున్నారని ఫైర్ అయ్యారు.