టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో.. వెంకటేష్తో బలగం దర్శకుడు

టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో.. వెంకటేష్తో బలగం దర్శకుడు

బలగం(Balagam) సినిమాతో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు జబర్దస్త్ కమెడియన్ వేణు(Comedian Venu). మానవ బంధాలు, అనుబంధాలు, కుటుంబ విలువలు వంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా చూస్తూ తమ కుటుంబాన్ని తలుచుకొని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఈ సినిమాతో ఆడియన్స్ మనసులను కదిలించాడు దర్శకుడు వేణు. సినిమా చూశాక వేణులో ఇంత విషయం ఉందా అని అనుకున్నారు చాలా మంది.

ALSO READ: కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

దీంతో వేణు చేయబోయే తరువాతి సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఈ దర్శకుడి తరువాతి సినిమా ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వేణు తన తరువాతి సినిమాను విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ కాంబో మాత్రం ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది. నెటిజన్స్ కూడా ఈ కాంబోలో సినిమా రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే రూమర్ లాగే ఉన్న ఈ కాంబోలో సినిమా నిజంగా వస్తుందా అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శైలేష్ కొలనుతో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా 2024 జనవరి 13 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా, రుహాణి శర్మ, తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్ నటుడు నావాజుద్దిన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.