అక్కినేనిపై వ్యాఖ్యల వివాదం..స్పందించిన బాలకృష్ణ

అక్కినేనిపై వ్యాఖ్యల వివాదం..స్పందించిన బాలకృష్ణ

అక్కినేనిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంపై నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. తాను  ఏదో ఫ్లోలో మాట్లాడిన మాటలే తప్పా.. ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. తాను అభిమానంతో అన్న మాటల్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను అభిమానంతో  బయట  మరో  రకంగా  కూడా పిలుస్తారని..అంత మాత్రానా వారిని కించపరిచినట్లు కాదన్నారు.   ఏఎన్ఆర్ తనకు బాబాయ్ అని.. తన పిల్లల కంటే ఎక్కువ తననే ప్రేమించే వాళ్లని..బయట ఏం జరిగినా తాను పట్టించుకోనన్నారు.  బాబాయ్ పై  ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు. పొగడ్తలకు  పొంగిపోవద్దనే విషయాన్ని అక్కినేని నాగేశ్వర్ రావు నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అభిమానంతో, యాసతో అలా పిలుచుకుంటామని..తన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఆప్యాయత తన గుండెల్లో ఉంటుందని తెలిపారు.

వీరసింహారెడ్డి సక్సెస్ ఈ వెంట్లో.. 

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో  ఆ రంగారావు ఈ రంగారావు.. ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై  ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య,  అఖిల్ కూడా  స్పందించారు. ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని, వారిని అగౌరవపరచటం  మనల్ని మనం కించపరుచుకోవటం అవుతుందంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు. ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ కుటుంబంతో తమ అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.