
బాలాపూర్ వినాయకుడిని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవ కమిటి మురళీదధర్ రావుకు స్వాగతం పలికారు. పూజల అనంతరం సన్మానించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఇండియా ప్రపంచంలో ఐదో స్థానంలో ఆర్థిక మహా శక్తిగా ఉన్నామన్నారు, దేశం ఆర్థిక విషయంలో మూడో స్థానానికి రావాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించానన్నారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు కొలన్ శంకర్ రెడ్డి, విజయ్ కుమార్, బాలాపూర్ గణనిథుని దర్శించుకొని ప్రత్యేక పూజలుచేశారు..
ALSO READ | ఖైరతాబాద్: బడా గణపతి దర్శనం కోసం భారీగా భక్తులు.. సెల్ పోన్ లు పోయాయని ఆందోళన