
ముషీరాబాద్, వెలుగు: బూత్ లెవెల్లో కొత్త ఓటర్ నమోదు ప్రాసెస్ను బల్దియా చేపట్టింది. బుధవారం ముషీరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఓటర్ ఎన్రోల్మెంట్, కరెక్షన్స్, అడ్రెస్ చేంజ్, నూతన ఓటర్ నమోదు కేంద్రాల ద్వారా ప్రాసెస్ను షురూ చేసింది. ఆయా కేంద్రాల వద్ద 18 ఏండ్లు నిండిన యువతతో పాటు ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అధికారుల ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఈ నెల 14వ తేదీ వరకు ఉంటుందని సెంటర్ ప్రతినిధులు రాజేందర్, నందకిషోర్ తెలిపారు.