పోలీసుల ఎదుట హాజరైన బాల్క సుమన్

పోలీసుల ఎదుట హాజరైన బాల్క సుమన్
  • మరో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​చైర్​ పర్సన్, వైస్​ చైర్​పర్సన్​ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్​ వెంకటస్వామి కాన్వాయ్​పై దాడి చేసిన కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,  మరో ముగ్గురు బీఆర్ఎస్​ లీడర్లు ఆదివారం రామకృష్ణాపూర్​ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత నెల 17న ఎక్స్​అఫిషియో ఓటు వేసేందుకు వెళ్తున్న మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్​పై రాళ్లు, ట్రాఫిక్​ డివైడర్​ కోన్స్​తో బాల్క సుమన్, బీఆర్ఎస్​శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, కొందరు కాంగ్రెస్​ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి బాల్క సుమన్​తో పాటు మరో 24 మందిపై రామకృష్ణాపూర్​ పోలీస్​స్టేషన్​లో రెండు కేసులు నమోదయ్యాయి.

గత నెల 18న సుమన్​తో పాటు మూల రాజిరెడ్డి, దొమకొండ అనిల్, రామిడి లక్ష్మికాంత్​ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి  మంచిర్యాల కోర్టు14 రోజుల రిమాండ్​ విధిస్తూ ఆదేశించడంతో వారిని ఆదిలాబాద్​ జిల్లా జైలుకు తరలించారు.ఈ నెల 4న నలుగురికి కోర్టు తీర్పు మేరకు షరతులతో కూడిన బెయిల్​మంజూరుచేశారు. ప్రతీ ఆదివారం రామకృష్ణాపూర్​ పీఎస్​లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుమన్, మరో ముగ్గురు పీఎస్​కు చేరుకొని సీఐ రమేశ్, ఎస్ఐ శ్రీధర్​ సమక్షంలో సంతకాలు చేశారు. ఇదే కేసులో మరో ఐదుగురు జైలులో ఉన్నారు.