25న అలయ్ బలయ్‌‌‌‌‌‌‌‌కి రండి.. ఉపరాష్ట్రపతికి విజయలక్ష్మి ఆహ్వానం

25న అలయ్ బలయ్‌‌‌‌‌‌‌‌కి రండి.. ఉపరాష్ట్రపతికి విజయలక్ష్మి ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్ బలయ్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమానికి రావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​ను అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో సంస్థ ట్రస్టీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయనకు ఇన్విటేషన్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. ఈ నెల 25న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆమె కోరారు.

 గత కొన్నేండ్లుగా తన తండ్రి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతలు, ఇతర వర్గాలను ఒకే చోటకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రొగ్రాంను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని వివరించారు.