బాధపెట్టి ఉంటే క్షమించండి.. అందరికీ ధన్యవాదాలు : బండి సంజయ్

బాధపెట్టి ఉంటే క్షమించండి.. అందరికీ ధన్యవాదాలు :  బండి సంజయ్


తెలంగాణ బీజేపీ అధ్యక్ష  పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇన్నిరోజులు  రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని తెలిపారు.  తన లాంటి సామాన్య కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చిన  ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు  సంజయ్ ధన్యవాదాలు చెప్పారు.  

హైకమాండ్ అంచనాలను అందుకున్నానని భావిస్తున్నానని, అవకావశం ఇచ్చిన పార్టీ పెద్దలకు సహకరించిన పార్టీ పెద్దలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తన బాధ్యతను నిర్వర్తించానని, తెలియక ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించాలన్నారు.  కొత్త రాష్ట్ర  అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంజయ్ స్పష్టం చేశారు.  కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  

2023 జూలై 04న ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి సంబంధించిన మార్పులను బండి సంజయ్ కు వివరించారు జేపీ నడ్డా. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని  అధిష్టానం నియమించింది. బండి సంజయ్ సేవలను కేంద్రంలో వినయోగించుకోనున్నారు పార్టీ పెద్దలు.

తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది.  ఏపీలో సోము వీర్రాజును తొలిగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది హైకమాండ్. రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రలకు కొత్త  అధ్యక్షులను నియమించింది.