తబ్లిగీ జమాత్​కు నిధులు ఎట్లిస్తరు? : బండి సంజయ్

తబ్లిగీ జమాత్​కు నిధులు ఎట్లిస్తరు? : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిగీ జమాత్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా విడుదుల చేస్తారని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వచ్చే నెల  6 నుంచి 8 వ తేదీ వరకు ఇస్లామిక్ సమాజం పేరిట తబ్లిగీ జమాత్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశం కోసం రాష్ట్ర సర్కార్ రూ.2 కోట్ల 45 లక్షలకుపైగా నిధులు మంజూరు చేయడం  దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం దివాళా తీసిందని.. వడ్డీలు కట్టడానికే ఖజానా సరిపోవడం లేదని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి నిధులివ్వడమేంటని  ప్రశ్నించారు. తుక్టే తుక్డే గ్యాంగ్ తో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని  ప్రశ్నించారు.