రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్

దేశ రాజకీయాలను మారుస్తానంటూ సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలు షురూ చేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని.. అందుకే బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కరీంనగర్ లో బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు, కేసులంటూ భయపెడతున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పిన పనులు చేయవద్దని అధికారులకు అనధికారిక ఆదేశాలిస్తున్నాడని.. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.  భవిష్యత్తులో మరిన్ని నిర్బంధాలు తప్పవన్న ఆయన.. వాటిని ఎదుర్కొనేందుకు నేతలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర నాయకత్వం తమకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఆయన.. టీఆర్ఎస్ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. స్థానిక సమస్యలపై ఉద్యమించడంతో పాటు కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు.

For more news..

యూపీ నాల్గో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’