బండి సంజయ్ మాట్లాడుతుండగా..మీడియాను లాగేసిన పోలీసులు

బండి సంజయ్ మాట్లాడుతుండగా..మీడియాను లాగేసిన పోలీసులు

కరీంనగర్ లో  తీవ్ర ఉద్రిక్తతల మధ్య  జాగరణ దీక్ష ప్రారంభించారు బండి సంజయ్. 317 జీవో రద్దు చేయాలంటూ జాగరణ దీక్ష చేస్తున్నారు. దీక్షకు ముందు ఎంపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరంలోని కార్యకర్తలను బయటకు ఈడ్చుకెల్లారు. కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీక్షా శిబిరానికి కరెంట్ కట్ చేసి.. అక్కడున్న టెంట్లు కూడా తొలగించారు పోలీసులు. ఇదే టైంలో నాటకీయ పరిణామాల మధ్య బైక్ పై దీక్షా స్థలికి చేరుకున్నారు బండి సంజయ్. పోలీసులను తప్పించుకుని లోపలికి వెళ్లి జాగరణ దీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం ఎంపీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. బండి సంజయ్  మీడియాతో మాట్లాడుతుండగానే.. మీడియా ప్రతినిధులను కూడా బలవంతంగా అక్కడ్నుంచి పంపేశారు పోలీసులు.