పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్త..జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ

పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్త..జేపీ నడ్డాతో  బండి సంజయ్ భేటీ

ఢిల్లీ :   కేంద్రంలో మూడోసారి బీజేపీని  అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి  సంజయ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాతో  సంజయ్ ఇవాళ  భేటీ అయ్యారు.  జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు నడ్డాకు సంజయ్  ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు. పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ తో కలిసి 15 నిమిషాలపాటు నడ్డాతో పలు విషయాలపై చర్చించారు. జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం   పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.