సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం సేవాలాల్ మహారాజ్ ను స్మరించుకునే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రాడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడని మండిపడ్డారు. సేవాలాల్ జయంతి కోసం కోటి ఇస్తామన్న కేసీఆర్.. ఆ మొత్తం దేనికి సరిపోతుందని ప్రశ్నించారు. 

ఎన్నికల కోసం పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని కేసీఆర్ అబద్దాలు చెప్తుండని బండి మండిపడ్డారు. గిరిజన బంధు సంగతేమైందన్న ఆయన.. బడ్జెట్ లో వారికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంజారాహిల్స్ లో సేవాలాల్ మహరాజ్ దేవాలయం కడతామని హామీ ఇచ్చారు. కొండగట్టుకు వెళ్లిన కేసీఆర్ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు.