కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం

కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం

కోవిడ్ కంటే పెద్ద వైరస్ సీఎం కేసీఆర్ అని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. మహబూబ్ నగర్ లో 317 జీవోకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. ఉపాధ్యాయులెవరూ ఆందోళన పడొద్దన్నారు.  సర్కార్  దరిద్రపుగొట్టు జీవో తెచ్చిందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. బీజేపీ వచ్చాక 317 జీవోను సవరిస్తామన్నారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా జారీ చేసిన వేస్ట్ జీవో 317 అని అన్నారు. సీనియర్లు జూనియర్లకు మధ్య కొట్లాట కేసీఆర్ పెట్టిండన్నారు.   తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం,ఎంఐఎం పార్టీలతో కేసీఆర్ కలుస్తున్నారన్నారు. ఢిల్లీలో 24 గంటలు దీక్ష చేస్తానన్న కేసీఆర్.. రాష్ట్రంలో నాలుగు గంటలు చేసిన తెలంగాణ ద్రోహి అని అన్నారు.  సీఎం కేసీఆర్ అవినీతిపై తప్పకుండా విచారణ చేస్తామన్నారు.  ఆయన అవినీతిపై విచారణ చేస్తామని తెలిసే  ధర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నాడన్నారు. టీఆర్ఎస్ మెడలు వంచే పార్టీ బీజేపీ అని అన్నారు. రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు బేడీలు వేసి హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిప్పుతామన్నారు. 317 జీవోను సవరించే వరకు పోరాటం చేస్తామన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.