సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ కొండగట్టు చుట్టు పక్కల భూములు కొన్నారని..అందుకే అక్కడికి వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ఇవాళ కొండగట్టుకు వెళ్లిండు కాబట్టి అక్కడి చుట్టుపక్కల భూములన్నీ త్వరలోనే ఖతం అవుతాయని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఫాంహౌస్ లో ఎక్కడ చూసినా నిమ్మకాయలే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌస్ కు వెళ్లాలంటే భయపడుతున్నారని చెప్పారు. తమకు కూడా తాంత్రిక పూజలు చేస్తారేమోనని ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారని తెలిపారు.