బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర

బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర

న్యూఢిల్లీ: బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తమపై దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై దాడులను ప్రేరేపిస్తున్నాడని అన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన బెట్టుకున్న కేసీఆర్.. ఉద్యమకారులను పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్  చెప్పేవన్నీ అబద్దాలు అయినందునే వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని పత్రికలను తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తన పత్రికలో ప్రధాని మోడీ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచురించిన విషయంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ సమాజం కేసీఆర్ పతనం కోరుకుంటోంది

మల్లన్న సాగర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్