తడిబట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్

తడిబట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్  ప్రశ్నించారు. 

బండి సంజయ్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ నెలకొంది. సంజయ్ కు వ్యతిరేకంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు  నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని ముందుగానే చెప్పిన సంజయ్ అక్కడికి చేరుకుని ప్రమాణం చేశారు.