కాంగ్రెస్ లేకపోతే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలు గానే ఉండేవాళ్ళం : బండ్ల గణేష్

కాంగ్రెస్ లేకపోతే  బ్రిటిష్ వాళ్ల కింద బానిసలు గానే ఉండేవాళ్ళం :  బండ్ల గణేష్

కాంగ్రెస్ పార్టీ వల్లే భారతదేశం వచ్చిందని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్ళమని చెప్పారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు  సూర్యాపేట జిల్లాలో ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గణేష్..  ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు.  సోనియాగాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. 

కర్ణాటక నుండి కాంగ్రెస్ హుదూద్ తుఫాన్ మొదలైందన్న గణేష్... తెలంగాణ నుండి గెలుచుకుంటూ, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాయమని ధీమా వ్యక్తం చేశారు.  150రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన వెల్లడించారు.  

ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. అందుకే ఆయనకు మద్ధతిచ్చే్ందుకు ఇక్కడికి వచ్చానన్నారు.  భట్టికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని చెప్పారు.