
కొలంబో: శ్రీలంకతో బుధవారం మొదలైన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. షాద్మాన్ ఇస్లామ్ (46), ముష్పికర్ రహీమ్ (35), లిటన్ దాస్ (34), మెహిదీ హసన్ మిరాజ్ (31) మెరుగ్గా ఆడటంతో తొలి రోజ ఆట ముగిసే టైమ్కు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 220/8 స్కోరు చేసింది. తైజుల్ ఇస్లామ్ (9 బ్యాటింగ్), ఎబాదత్ హుస్సేన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో.. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. షాద్మాన్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో అనాముల్ హక్ (0), మోమినల్ హక్ (21), నజ్ముల్ హుస్సేన్ శాంటో (8) ఫెయిలయ్యారు. దాంతో 76/4తో కష్టాల్లో పడిన బంగ్లాను ముష్ఫికర్, లిటన్ ఐదో వికెట్కు 67 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అషితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, సోనల్ దినుషా తలా రెండు వికెట్లు తీశారు.