మిర్పూర్: బంగ్లాదేశ్తో గురువారం మొదలైన రెండో టెస్ట్లో ఇండియాకు తొలి రోజే పట్టు చిక్కింది. పాత బాల్తో ఉమేశ్ యాదవ్ (4/25) మెరుపులు మెరిపిస్తే, రవిచంద్రన్ అశ్విన్ (4/71) స్పిన్ మ్యాజిక్ చేయడంతో.. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 73.5 ఓవర్లలో 227 రన్స్కే ఆలౌటైంది. మోమినుల్ హక్ (157 బాల్స్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 84) ఒంటరిగా పోరాడినా.. రెండో ఎండ్లో అతనికి సహకారం కరువైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 8 ఓవర్లలో 19/0 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (3 బ్యాటింగ్), శుభ్మన్ గిల్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 208 రన్స్ వెనుకబడి ఉంది.
పేస్‑స్పిన్తో దెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాను ఇండియా పేస్–స్పిన్ కాంబినేషన్తో దెబ్బ కొట్టింది. ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఉమేశ్ యాదవ్.. పాత బాల్తో తన జోరు చూపెట్టాడు. 9వ ఓవర్లో ఛేంజ్ బౌలర్గా వచ్చిన జైదేవ్ మంచి లైన్ అండ్ లెంగ్త్తో ఆకట్టుకున్నాడు. సిరాజ్ను కంటిన్యూ చేసిన రాహుల్.. ఉమేశ్కు రెస్ట్ ఇవ్వడంతో జైదేవ్ ఉనాద్కట్ (2/50) వికెట్లపతనం మొదలుపెట్టాడు. దీంతో ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ (24), జాకీర్ హసన్ (15) శుభారంభం ఇవ్వలేకపోయారు. రెండు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్కావడంతో బంగ్లా 39 రన్స్కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోమినుల్ హక్ ఓ ఎండ్లో ఒంటరిగా పోరా డాడు. రెండో ఎండ్లో కెప్టెన్ షకీబ్ (16) కాస్త బ్యాట్ అడ్డేయడంతో లంచ్ వరకు బంగ్లా 82/2 స్కోరుతో మంచి స్థితిలోనే కనిపించింది. కానీ రెండో సెషన్లో అశ్విన్కు తోడుగా ఉమేశ్ చెలరేగాడు. పాత బాల్ను రివర్స్ స్వింగ్ చేస్తూ బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. లంచ్ తర్వాత వేసిన మొదటి బాల్కే షకీబ్ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఓ సూపర్ లెంగ్త్ బాల్కు షకీబ్.. మిడాఫ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మోమినుల్తో కలిసిన ముష్ఫికర్ (26) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నా పెద్దగా వర్కౌట్ కాలేదు. నాలుగో వికెట్కు 48 రన్స్ జోడించి వెనుదిరిగాడు. లిటన్ దాస్ (25) అటాకింగ్ మూడ్లో కనిపించినా.. అశ్విన్ మ్యాజిక్ ముందు పని చేయ లేదు. అశ్విన్ ఫుల్ లెంగ్త్ డెలివరీని ఫ్లిక్ చేయ బోయి నేరుగా రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి బంగ్లా స్కోరు 172/5. రెండో సెషనల్లో బంగ్లా 29 ఓవర్లలో 102 రన్స్ జోడించింది. థర్డ్ సెషన్లో జోరందుకున్న ఉమేశ్.. వరుస విరామాల్లో మెహిదీ హసన్ (15), నురుల్ (6), టస్కిన్ అహ్మద్ (1)ను పెవిలియన్కు పంపడంతో స్కోరు 223/8గా మారింది. చివర్లో అశ్విన్ డబుల్ మ్యాజిక్ చేశాడు. 74వ ఓవర్లో మూడు బంతుల తేడాలో.. అప్పటివరకు క్రీజులో పాతుకుపోయిన మోమినుల్తో పాటు ఖాలిద్ అహ్మద్ (0)ను ఔట్ చేసి బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.
కుల్దీప్ను ఎలా తప్పిస్తారు?
తొలి టెస్ట్లో 8 వికెట్లు, 40 రన్స్ చేసిన రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఈ మ్యాచ్కు తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన ప్లేయర్ను తప్పించడం ‘నమ్మశక్యంగా లేదని’ లెజెండరీ ప్లేయర్ గావస్కర్ అన్నాడు. ఈ విషయంలో ఇంతకంటే పదునైన వ్యాఖ్యలు చేయాల్సి ఉన్నా.. కేవలం ఈ పదంతోనే సరిపెడుతున్నానని, దీనిని టీమిండియా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలన్నాడు. మాజీ పేసర్ దొడ్డ గణేశ్, అంజుమ్ కూడా సన్నీ వ్యాఖ్యలతో ఏకీభవించారు. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండ టంతో ఎక్స్ట్రా సీమర్గా జైదేవ్ను తీసుకున్నామని కోచ్ ద్రవిడ్, రాహుల్ చెప్పినా విమర్శలు ఆగడం లేదు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 73.5 ఓవర్లలో 227 ఆలౌట్ (మోమినుల్ హక్ 84, ఉమేశ్ 4/25, అశ్విన్ 4/71), ఇండియా తొలి ఇన్నింగ్స్: 8 ఓవర్లలో 19/0 (రాహుల్ 3 బ్యాటింగ్, శుభ్మన్ గిల్ 14 బ్యాటింగ్).
118 మ్యాచ్ల తర్వాత..
టీమిండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ అసాధారణ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. డిసెంబర్ 16, 2010లో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడిన అతను.. 12 ఏళ్ల తర్వాత రెండో మ్యాచ్ ఆడాడు. ఈ మధ్యలో జైదేవ్ 118 మ్యాచ్లు మిస్సయ్యాడు. దీంతో టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక మ్యాచ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రెండో క్రికెటర్గా జైదేవ్ నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ గారెత్ బట్టీ (142 మ్యాచ్లు, 2005-–16) టాప్ ప్లేస్లో ఉన్నాడు. గతంలో ఇండియా తరఫున పార్థివ్ పటేల్ (8 ఏళ్ల గ్యాప్) పేరిట ఈ రికార్డు ఉండేది.