
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (148), ముష్ఫికర్ రహీమ్ (163) సెంచరీలకు తోడు లిటన్ దాస్ (90) రాణించడంతో.. రెండో రోజు ఆట ముగిసే టైమ్కు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 484/9 స్కోరు చేసింది. హసన్ మహ్ముద్ (0 బ్యాటింగ్), నహీద్ రాణా ( 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 292/3 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లా ఇన్నింగ్స్ను స్టార్టింగ్లో లంక బౌలర్లు ఏమాత్రం ఇబ్బందిపెట్టలేదు.
దాంతో ఓవర్నైట్ బ్యాటర్ ముష్ఫికర్ రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. సెంచరీ పూర్తి చేసిన శాంటోతో నాలుగో వికెట్కు 264 రన్స్ జత చేసిన ముష్ఫికర్.. లిటన్ దాస్తో ఐదో వికెట్కు 149 రన్స్ జోడించాడు. అయితే ఎనిమిది బంతుల తేడాలో ముష్పికర్, లిటన్ ఔట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ తడబడింది. చివర్లో జాకెర్ అలీ (8), నయీమ్ హసన్ (11), తైజుల్ ఇస్లామ్ (6) నిరాశపర్చారు. అషితా ఫెర్నాండో, మిలాన్ రత్ననాయకే, తరిండు రత్ననాయకే తలా మూడు వికెట్లు తీశారు.