
బంజారాహిల్స్ రోడ్నంబర్ 12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో బుధవారం గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను ఆకట్టుకుంది. స్వామివారికి 56 రకాల ఫలహారాలతో అన్నకూట్ సమర్పించారు. గోపూజ, భక్తి కీర్తనలు, పల్లకీ ఉత్సవం, నెయ్యి దీపారాధతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ గోవర్ధన లీలల గురించి ప్రసంగించారు.