
‘దసరా’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తెలుగు- కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. ఎమ్ అభిషేక్ దర్శకత్వంలో హెచ్ కె ప్రకాష్ నిర్మిస్తున్నారు. బృందా ఆచార్య హీరోయిన్. తాజాగా దీక్షిత్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో గన్ షూట్ చేస్తూ, కాలికి టైగర్ మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్న దీక్షత్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ఈ నెల 25న టీజర్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. జుధాన్ శ్యాండీ సంగీతం అందిస్తున్నాడు.