హైదరాబాద్, వెలుగు : సిటీలోని పంజాగుట్టలో బ్యాంక్ఆఫ్మహారాష్ట్ర (బీవోఎం) రెండు బ్రాంచ్లను ప్రారంభించింది. శనివారం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే సమక్షంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. కృష్ణారావు మిడ్ కార్పొరేట్ బ్రాంచ్తో పాటు పంజాగుట్ట శాఖ బ్రాంచ్ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఇవి స్థానిక ప్రజల బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీర్చుతాయని పేర్కొన్నారు.
రిటైల్, ఎమ్ఎస్ఎమ్ఈలపై దృష్టి పెట్టాలని బ్యాంక్బ్రాంచ్ల నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్లో బ్రాంచ్లను ప్రారంభించినందుకు ప్రశంసించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే మాట్లాడుతూ... రిటైల్కస్టమర్లకు, చిన్న వ్యాపారులకు సేవలు అందించడంతో బ్రాంచ్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. దేశంలో 2,200 కంటే ఎక్కువ బ్రాంచ్లతో 30 మిలియన్ల కస్టమర్లకు బీవోఎం సేవలందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనరల్మేనేజర్లు ఏఎఫ్కబాడే, చిత్ర దాతర్, జోనల్మేనేజర్సుశాంత్ కుమార్ గుప్తా, మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ మేనేజర్ పి.మనోహర్, పంజాగుట్ట బ్రాంచ్ మేనేజర్ జి.రమేశ్, హైదరాబాద్ జోన్ టీమ్ పంజాగుట్ట, టీమ్ పాల్గొన్నారు.