బంజారాహిల్స్, వెలుగు: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్ బిల్లును ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16,17 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నట్టు అయన చెప్పారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని, ఎగవేతదారులను ఎందుకు జైల్లో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును కొందరు లీగల్గా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీలు సుజనాచౌదరి, లగడపాటి రాజగోపాల్ లాంటి వారు కూడా బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సిఉన్నదన్నారు.. మొత్తం 13 మంది బ్యాంక్ ఖాతాదారులు రూ.4,46,800 కోట్లు బకాయి పడగా.. రూ. 1,61,820 కోట్లు సెటిల్ చేసుకున్నారని, మిగిలిన రూ. 2,84,980 కోట్లు బ్యాంకులు నష్టపోయాయన్నారు. ఇలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులలో కార్పొరేట్ సంస్థలే డిఫాల్టర్లుగా ఉంటున్నాయని వివరించారు. బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే చార్జీలు, వడ్డీలు పెరుగుతాయని, సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐబీఓఏ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కార్యదర్శి హర్ నాథ్, బ్యాంక్ ఎంప్లాయిస్ లీడర్లు మోహన్, పి.వి.కృష్ణారావు, ఫణికుమార్, చంద్రశేఖర్, ఉదయ్, సమద్ ఖాన్, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు
బ్యాంకుల ప్రైవేటైజేషన్ బిల్ విత్ డ్రా చెయ్యాలే
- బిజినెస్
- December 14, 2021
లేటెస్ట్
- అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇంటి దగ్గర రెక్కీ.. పెద్ద డ్రోన్స్ ఎగురవేసిన వ్యక్తులు
- 8వ తేదీలోపు అందరికీ రైతు బంధు : 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా : సీఎం రేవంత్ రెడ్డి
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- 2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
- కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?