కార్పొరేట్ సెలూన్లతో నాయీబ్రాహ్మణుల పొట్ట కొట్టొద్దు.. ఓం మణికంఠ నాయీబ్రహ్మణ సేవా సంఘం ధర్నా

కార్పొరేట్ సెలూన్లతో నాయీబ్రాహ్మణుల పొట్ట కొట్టొద్దు.. ఓం మణికంఠ నాయీబ్రహ్మణ సేవా సంఘం ధర్నా

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ పైప్​లైన్​ రోడ్డులో  చీప్ ​ఆండ్​ బెస్ట్​ పేరుతో ఓ కార్పొరేట్​ సంస్థ సెలూన్​ను ఏర్పాటు చేసింది. దీంతో  ఓం మణికంఠ నాయీబ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సెలూన్​ ఎదుట ధర్నా నిర్వహించారు. 

కార్పొరేట్​ సెలూన్స్​ హటావో,  నాయీబ్రాహ్మణ్​ కో బచావో అంటూ  నినాదాలు చేశారు. కార్పొరేట్​ సెలూన్ల వల్ల నాయీబ్రాహ్మణుల కులవృత్తి ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ మేడ్చల్​ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్​ సింహారెడ్డి మద్దతు పలికారు.