పార్లమెంట్​ బరిలో బర్రెలక్క

పార్లమెంట్​ బరిలో బర్రెలక్క

 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్​ నుంచి పోటీ చేసిన బర్రెలక్క అలియాస్​ శిరీష మంగళవారం నాగర్​ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుటుంబసభ్యులతో కలిసి రిటర్నింగ్​ ఆఫీసర్​కు నామినేషన్​ పత్రాలు అందజేశారు. అలాగే గాలిముడి గీత, పిల్లెల శ్రీకాంత్​, నేడిగొండ కృష్ణయ్య, పాలాది నాగరాజు, లంద భిక్షపతి తదితరులు ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా నామినేషన్​ దాఖలు చేశారు.