బాసర ట్రిపుల్​ ఐటీలో స్టూడెంట్​ ఆత్మహత్య

బాసర ట్రిపుల్​ ఐటీలో స్టూడెంట్​ ఆత్మహత్య
  • రూమ్​లో ఉరివేసుకున్న భానుప్రసాద్​
  • మృతుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచాల
  • గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు
  • నాలుగు నెలల్లో వర్సిటీలో ఇది రెండో ఘటన

నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో మరో  స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలో చదువుతున్న రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన పి.భానుప్రసాద్ ఆదివారం రాత్రి తన రూమ్​లో  ఉరివేసుకొని మృతి చెందాడు. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా యూనివర్సిటీ అంబులెన్స్ లో భానుప్రసాద్​ మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పజెప్పినట్టు తెలుస్తున్నది. 

రూమ్​లో సూసైడ్​ నోట్​ లభించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. నాలుగు నెలల్లో యూనివర్సిటీలో ఇది రెండో ఆత్యహత్య. ఆగస్టు 23న సురేశ్​ అనే స్టూడెంట్​తన రూమ్​లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.