
బషీర్బాగ్, వెలుగు: హాల్ టికెట్లు ఇవ్వట్లేదంటూ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ స్టూడెంట్లు శనివారం రోడ్డెక్కారు. 75 శాతం అటెండెన్స్ లేదని సాకు చూపుతూ తమ జీవితాలతో ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ గేట్ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 350 మంది డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్లకు హాల్ టికెట్స్ అందాల్సి ఉందన్నారు. పోలీసులు చేరుకుని స్టూడెంట్లతో ఆందోళనను విరమింపజేశారు. కాగా, హాల్టికెట్లు లేకపోవడంతో శనివారం జరిగిన 4వ, 6వ సెమిస్టర్ ఎగ్జామ్స్ను 350 మంది రాయలేకపోయారు.