
నిజామాబాద్, వెలుగు: అగ్రవర్ణాలకు కల్పించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసి బీసీలకు కలుపాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.
స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ను అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ హెచ్.రేవంత్, బీసీ ఉగ్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపె రవీందర్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కె. నాగరాజు, ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ పోల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.