బీసీల్లో రాజకీయ చైతన్యం నింపాలి: ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య

బీసీల్లో రాజకీయ చైతన్యం నింపాలి: ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించి బీసీ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం నింపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సూచించారు.  ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌‌‌‌లో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయాదవ్‌‌‌‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య, బీసీ సేన జాతీయ అధ్యక్షుడు  బర్కా కృష్ణ యాదవ్ హాజరై మాట్లాడారు.  

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.  సీట్లలో అన్యాయం జరిగితే అన్ని రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు కావాల్సింది రాజ్యాధికారంలో వాటా అన్నారు.  కార్యక్రమంలో విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ రాగ్య అరుణ్, జిల్లాపల్లి అంజి, మద్దూరు వెంకటేష్ యాదవ్, నిరంజన్, కృష్ణా,మధు, సందీప్, వేణు తదితరులు పాల్గొన్నారు.