ఎన్నికల్లో బీసీల సత్తా చాటుదాం.. ప్రధాన పార్టీలు బహుజనులకే టికెట్ ​ఇవ్వాలి

ఎన్నికల్లో బీసీల సత్తా చాటుదాం.. ప్రధాన పార్టీలు బహుజనులకే టికెట్ ​ఇవ్వాలి
  • బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక డిమాండ్​
  • మంచిర్యాల జిల్లాలో భారీ బైక్​ర్యాలీ

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: రాజ్యాధికారమే ధ్యేయంగా బహుజనులు పోరాడాలని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వరకు భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని, ఓట్లు మావే... సీట్లు మావే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ ప్రధాన పార్టీ అయినా బీసీని అభ్యర్థిగా ప్రకటిస్తే అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 

పార్టీలు టికెట్​ఇవ్వకుంటే ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇండిపెండెంట్​అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. దీనికి ముందుగా మంచిర్యాల, లక్సెట్టిపేటలో అంబేద్కర్​ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదిక అధ్యక్షుడు చంచు రాజ్​కిరణ్, డాక్టర్లు బి.రఘునందన్, పి.రమణ, నీలకంఠేశ్వర్​గౌడ్, లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్​ముత్తె సత్తయ్య, మంచిర్యాల, నస్పూర్​మున్సిపల్​వైస్​చైర్మన్లు గాజుల ముఖేశ్​గౌడ్, దొమ్మటి అర్జున్, తోట శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, చుంచు గిరిధర్, సుధాకర్​పాల్గొన్నారు.