ముషీరాబాద్, వెలుగు : పెంచిన ఫీజులు కట్టలేక బీసీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. 2014 ముందు వరకు ట్యూషన్, స్పెషల్ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భరించగా, బీఆర్ఎస్ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఫీజులకు గండి కొట్టిందని మండిపడ్డారు. దీంతో బీసీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్రాశారు. 10 నెలలుగా బీసీ హాస్టళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో 8 లక్షల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.