ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. జనరల్ స్థానాల్లోనూ బీసీలకు చాన్స్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. జనరల్ స్థానాల్లోనూ బీసీలకు చాన్స్
  • ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అత్యధిక ఓటర్లుగా బీసీలు
  •  ఆయా వార్డులు, డివిజన్లలో బీసీలకే మెజార్టీ టికెట్లు కేటాయించిన పార్టీలు
  •  మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో బరిలో అత్యధిక పోటీదారులు బీసీలే..

మహబూబ్​నగర్​, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో దాదాపు 29.30 లక్షల మంది ఓటర్లు ఉండగా,  అందులో దాదాపు 51 శాతం మంది బీసీలు ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్షన్​ కమిషన్​ 41.5 శాతం స్థానాలను బీసీలకు కేటాయించగా, తాజాగా జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ డెడికేషన్ కమిటీ ​ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం కమిషన్ మెజార్టీ స్థానాలను బీసీలకు రిజర్వ్​ చేసింది. అయితే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఈ వర్గానికి కేటాయించిన స్థానాలతో పాటు అన్​రిజర్వ్, అన్​రిజర్వ్​మహిళా స్థానాల్లోనూ బీసీలను పోటీకి దింపేందుకు మొగ్గు చూపాయి. దీంతో చాలా స్థానాల్లో బీసీ లీడర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

బీసీలకు సీట్ల కేటాయింపు ఇలా.. 

నాగర్​కర్నూల్​ మున్సిపాల్టీలో 24 వార్డులుండగా ఏడు స్థానాలు బీసీలకు, 12 స్థానాలు జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. ఇందులో జనరల్​స్థానాల్లో కాంగ్రెస్ -ఎనిమిది మంది, బీఆర్​ఎస్​ తొమ్మిది మంది, బీజేపీ ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించాయి. కల్వకుర్తి మున్సిపాల్టీలో 22 వార్డులుండగా బీసీలకు ఆరు, జనరల్​కు 11 స్థానాలు రిజర్వ్​ చేయగా, జనరల్​ స్థానాల నుంచి బీసీలు కాంగ్రెస్​ నుంచి ఒకరు, బీఆర్​ఎస్​ నుంచి ఒకరు, బీజేపీ నుంచి నలుగురు పోటీ పడుతున్నారు.

కొల్లాపూర్​ మున్సిపాల్టీలో 19 వార్డులుండగా ఐదు స్థానాలు బీసీలకు, పది స్థానాలకు జనరల్​కు కేటాయించగా, జనరల్​ స్థానాల్లో కాంగ్రెస్​ నుంచి తొమ్మిది మంది, బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి పది మంది చొప్పున బీసీలు పోటీ చేస్తున్నారు. 

నారాయణపేట మున్సిపాల్టీలో 24 వార్డులుండగా బీసీలకు ఎనిమిది, జనరల్​కు 12 స్థానాలు కేటాయించారు. అన్ని జనరల్​ స్థానాల్లో ప్రధాన పార్టీలు బీసీలకే అవకాశం కల్పించాయి. 

 కోస్గిలో 16 వార్డులుండగా ఐదు బీసీలు, ఎనిమిది జనరల్​కు కేటాయించగా, జనరల్​ స్థానాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీల నుంచి ఆరు మంది చొప్పున బీసీలు పోటీ చేస్తున్నారు. 

మహబూబ్​నగర్​ కార్పొరేషన్​ పరిధిలో 60 డివిజన్​లు ఉండగా,  బీసీలకు 23, జనరల్​కు 30 స్థానాలు రిజర్వ్​ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్​ జనరల్​ స్థానాల్లో 24 మంది బీసీలను పోటీకి దింపింది. 

దేవరకద్ర మున్సిపాల్టీలో 12 వార్డులుండగా మూడు బీసీలకు, ఆరు స్థానాలకు జనరల్​కు కేటాయించగా, జనరల్​ స్థానాల్లో కాంగ్రెస్​ ఐదుగురు బీసీలను, బీజేపీ నలుగురికి, బీఆర్​ఎస్​ ముగ్గురికి పోటీకి అవకాశం కల్పించాయి. 

భూత్పూర్​ మున్సిపాల్టీలో పది వార్డులుండగా రెండు బీసీలకు, ఐదు జనరల్​కు కేటాయించారు. జనరల్​ స్థానాల్లో కాంగ్రెస్​ నుంచి ఇద్దరు, బీఆర్​ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు పోటీ చేస్తున్నారు.

వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా 11 స్థానాలు బీసీలకు, 17 స్థానాలు జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. ఇందులో జనరల్​ స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాయి. మొత్తంగా కాంగ్రెస్​ పార్టీ బీసీలు 26 మందికి, బీఆర్​ఎస్​ 24 మందికి, బీజేపీ 23 మందిని పోటీకి దింపింది. 

కొత్తకోటలో 15 వార్డులుండగా, అందులో నాలుగు బీసీలకు, ఎనిమిది జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. ఈ స్థానాల్లో మూడు పార్టీలు తొమ్మిది మంది చొప్పున బీసీలకు అవకాశం కల్పించింది. 

పెబ్బేరులో 12 వార్డులుండగా బీసీలకు రెండు, జనరల్​కు ఆరు రిజర్వ్​ కాగా, బీఆర్​ఎస్​ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఆరుగురు బీసీలు బరిలో నిలిచారు. 

అమరచింతలో పది వార్డులుండగా బీసీలకు రెండు, జనరల్​కు ఐదు స్థానాలు రిజర్వ్​ కాగా, మూడు పార్టీలు ఐదు మంది చొప్పున బీసీలకు పోటీకి అవకాశం కల్పించాయి. 

ఆత్మకూరులో పది వార్డులుండగా బీసీలకు మూడు, జనరల్​కు ఐదు స్థానాలు కేటాయించగా, మూడు పార్టీలు ఆరు మంది చొప్పున బీసీలను రంగంలోకి దింపాయి.

గద్వాల మున్సిపాల్టీలో 37 వార్డులుండగా,13 బీసీలకు, 19 స్థానాలు జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. ఇందులో బీజేపీ 29 మందికి, కాంగ్రెస్​ 23 మందికి, బీఆర్​ఎస్​ 22 మంది బీసీలకు పోటీకి అవకాశం కల్పించింది. 

అలంపూర్​లో పది వార్డులుండగా రెండు వార్డులు బీసీలకు, ఐదు వార్డులు జనరల్​కు కేటాయించారు. ఈ స్థానాల నుంచి ఆయా పార్టీల తరఫున మొత్తం పది మాత్రమే బీసీలు పోటీలో ఉన్నారు. 

వడ్డేపల్లి మున్సిపాల్టీలో పది వార్డులుండగా రెండు బీసీలకు, ఐదు స్థానాలకు జనరల్​కు కేటాయించారు. ఈ మున్సిపాల్టీ నుంచి ఎన్నికల బరిలో 40 మంది క్యాండిడేట్లు పోటీ పడుతుండగా, అందులో 24 మంది బీసీలు ఉన్నారు. 

అయిజ మున్సిపాల్టీలో 20 వార్డులుండగా మొత్తం 63 మంది పోటీ పడుతుండగా అందులో 27 మంది బీసీలు ఉన్నారు.