
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 4న సీజన్ ప్రారంభం కానున్న ఈ టోర్నీ 23రోజుల పాటు సాగనుంది. మొదటి మ్యాచ్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది. అన్ని సాయంత్రం మ్యాచ్లు 7:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం మ్యాచ్లు జరుగుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ జట్లు ఈటోర్నీలో తలపడనున్నాయి.