టీ20 వరల్డ్ కప్లో ఓటమి..సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు

టీ20 వరల్డ్ కప్లో ఓటమి..సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు

టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి తర్వాత బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సహా సెలక్షన్ కమిటీ మొత్తంపై వేటు వేసింది. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సీనియర్ మెన్స్ జట్టను ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలక్టర్లు కావలి అంటూ పేర్కొంది. 

కనీసం 7 టెస్టు మ్యాచ్లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన వారు అర్హులు అని బీసీసీఐ వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల క్రితమే రిటైరై ఉండాలని.. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.